Wednesday, October 17, 2012

శ్రీ అమ్మవారి భక్తులకు మనవి

శమంతకమణిని సంపాదించడం కోసం జాంబవంతుడ్ని తరుముకుని  శ్రీకృష్ణుడు ఒక గుహలోకి వెళ్ళి పోయాడు. వెంటనే గుహ ద్వారము లోపలి నుండే  ఒక పెద్ద బండతో మూయబడింది. లోపలినుండు నెత్తుటి ధారలు వస్తున్నాయి.లోపలికి వెళ్ళే సాహసం ఎవరూ చెయ్యలేక పోయారు. కృష్ఠుడు సురక్షితంగా భయిటపడాలని కోరుతూ యజ్జం యాగాదులు చెయ్యాలని నిర్ణయించి పండితులను పిలిచారు. వారు పంచాంగాలు తిరగేసి యజ్జం,యాగాదులు నిర్వహించుటకు సరైన తిథి ,వార,కరణ,నక్షత్ర యోగాలు లేవని చెప్పేరు.

ఆ క్లీష్ఠ పరిస్థితిలో నారధ మహర్షులు అక్కడికి విచ్చేసారు. ఇతర దేవతల కొరకు యజ్జం,యాగాదులు,పూజలు చెయ్యాలంటేనే పంచాంగాలు తిరగెయ్యాలి. మంచి ముహూర్తం చూడాలి .కాని జగ్నమాత అయిన  శ్రీ అమ్మవారిని  పూజించుటకు ఎటువంటి నియమ ,నిభంధనలు లేవని స్పష్ఠం చేసారు.

ఆ తరువాత శ్రీ అమ్మవారికి యజ్జం నిర్వహించడం కృష్ణుడు సురక్షితంగా భయిట పడటం  జరిగి పోయాయి.కలియుగాన ప్రతి ఒక్కరు పొట్ట కూటి కొరకు పడే పాట్ల మద్యన నియమ నిభంధనలతో ఇతర దేవతలను పూజించడం ప్రసన్నం చేసుకోవడం దాదాపుగా అసంభవమే. పైగా ఆది శక్తి అయి సమస్త దేవతలను సృష్ఠించిన శ్రీ అమ్మవారిని పూజిస్తే అందరు దేవుళ్ళను పూజించినట్టే అవుతుంది.

నామం -నామి:
నామానికి (పేరు) నామికి ( పేరుగల వ్యక్తికి) నడుమ తేడాలెమి ఉండవు. ఈ శతనామావళిలోని అమ్మవారి నామాల అర్థం -పరమార్థం తెలుసుకుని పఠించి ద్యానం చేసిన యెడల ఇందులోని నామాలు సాక్షాత్తు శ్రీ అమ్మవారై మీ కోరుకలను నెరవేరుస్తాయి.

ఆంజనేయ స్వామి రామ నామాన్ని ఆయుధం చేసుకుని సాక్షాత్తు రాముడ్నే తికమక పెట్టిన సంగతిని గుర్తుకు తెచ్చుకుంటే నామం యొక్క భలం స్పష్ఠంగా అర్థమవుతుంది.

పంచ దశాక్షర్యై నమ:

"పంచ  " అనగా ఐదు ," దశా " అనగా పది  ఐదు x పది = యాబై .సంస్క్రుతంలో మొత్తం యాబై అక్షరాలే. అంటే ప్రతి అక్షరం అమ్మవారి రూపమే. వేరే మాటల్లో చెప్పాలంటే అమ్మవారే ఈ యాబై అక్షరాలై ఉందన్న మాట. అందుకే  అమ్మవారికి పంచ దశాక్షర్యై  అని ఒక నామం ఉన్నది.

అన్ని అక్షరాలు అమ్మవారే అయినప్పుడు - ఆ అమ్మవారి నామాలకు ఇంకెంత శక్తి ఉంటుందో ఊహించుకొండి. ఇంకా ఈ నామాలకు ముందు ప్రణవమగు " ఓం" చివరన "నమ:" కూడ కలిపి చెప్పవలసి ఉంటుంది. అప్పుడా శక్తి ఇంకెంత హెచ్చుతుందో ఊహించండి.

ఇంతే కాదు ఈ నామాలకు భీజాక్షరాలను జోడిస్తే గాలిలో ఎగిరే రాకెట్టుకు అణ్వాస్త్త్రాన్ని జోడించినట్టే మీ ప్రగతి పథంలోని అడ్డు -ఆటంకాలన్ని పటా పంచలైపోతాయి.

కుండలి అనే అధ్బుత శక్తి:
ప్రతి వ్యక్తిలోను అఖండమైన యోగ శక్తి కుండలి రూపంలో గుదమునకు రెండంగుళాల పైన మూలాధార చక్రమున సర్పం వలే తన తోకను తనే కరచుకుని ఉందని యోగ శాస్త్రం చెబుత్తుంది.

మనిషిలో అతని స్వాస సూర్య నాడి ,చంద్ర నాడిగా నడుస్తుంటుంది. (కుడి ఎడమ నాశికా ద్వారముల ద్వారా) ఏదైన అరుదైన తరుణంలో అది సూక్ష్మ్నా  నాడి ద్వారా జరుగును. ( భగవత్ ద్యానంలో లోతుల్లోకి వెళ్ళినప్పుడు/ఏదైన మోయలేని శోకం కలిగినప్పుడు, గురువులు దీక్ష ప్రసాదించినప్పుడు )

అది కొందరికి అభ్యాసం ద్వారా ,కొందరికి గత జన్మల్లో చేసిన అభ్యాసం ద్వారా జరుగును. అలా శ్వాస సూక్ష్మ్ణా ద్వారం గుండా జరిగినప్పుడు కుండలి జాగృతమవుతుంది.

అది ఇందాక స్థితమై ఉన్న స్థానం మూలాధారం. అది భూతత్వం. అలా కుండలి మూలాధారంలో నిద్రావస్థలో ఉన్నంత వరకు మనిషికి ఈ భూమి మీద ఉన్న వస్తువులపై ఎన లేని ఆకర్షణ ఉంటుంది. వాటి కోసం అలమటిస్తుంటాడు.

అది జాగృతమై పైకి ప్రాకడం మొదలవ్వగానే మనిషికి బూతలం పై ఉన్న సఖల విషయాల పై "ఆధిపత్యం" ఏర్పడుతుంది. ఇక పై పైకి దాని పయణం సాగితే జరిగే అధ్భుతాలు అనంతం.

భీజాక్షరాలు:
కుండలిలో చైతన్యం పుట్టించడానికి మరో మార్గం ఉంది.అదే భీజాక్షర పఠనం. భీజాక్షరం అంటే ఏమో కాదు.. అక్షరాలకు చివర "మ్" కలిపి ఉచ్చారణ చెయ్యడం. ఉ: అం, ఆం ,ఇం

అక్షరాల వెనుక "మ్" కలిపితే ఏమవుతుంది.  నోరు -గుదము ఒకే గొట్టం యొక్క ప్రారంభం -ముగింపుగా ఉన్నవి. యోగ శాస్త్ర్రం భోధించే షఠ్చక్రాలు దాదాపుగా ఈ గొట్టానికి అటు ఇటుగా ఉన్నాయి. నోట భీజాక్షరాలు పలికినప్పుడు పెదాలు మూత పడి -తెరుచుకుంటాయి. ఈ కదలిక గొట్టమంతట వ్యాప్సితుంది. గొట్టానికి అటు ఇటుగా ఉన్న చక్రాలను తాకుతాయి. ముఖ్యంగా గుద స్థానమునకు రెండంగుళములు పై ఉన్న మూలాధారాన్ని తాకుతాయి. దీంతో కుండలిలో జాగృతి వస్తుంది.

భీజాక్షరాలు - కోరికలు :
కుండలి చైతన్యం కావడానికే కాదు - మీ కోరికలు నెరవేరడానికి సైతం భీజాక్షరాలు సహకరిస్తాయి. శ్రీ అమ్మవారి  నామానికి ముందుగా  క్రింద తెలిపిన కొన్ని భీజాక్షరాలు కలుపుకొండి. ఉదాహరణకు : మీకు విద్య కావాలంటే "ఐం" , ప్రపంచ మాయనుండి భయిట పడాలంటే "హ్రీం" , భయము,భీతినుండి విముక్తి కావాలంటే "క్లీం" , సంపద కావాలంటే  "శ్రీం" భీజాలను కలుపుకుని జపించండి.

ఉదా: ఓం ఐం విద్యాయై నమ: ఓం క్లీం చండికాయై నమ:

మూడు జన్మల ప్రయాస:
ఒక జన్మంతా  నమ:శివాయ అనే పంచాక్షరిని జపిస్తేనే తదుపరి జన్మలో రామ నామం జపించే యోగం పదుతుందట. ఆ జన్మంతా రామ నామం జపిస్తేనే తదుపరి జన్మలో శ్రీ అమ్మవారి పై మనస్సు మళ్ళుతుంది. ఈ శతనామావళిని మీరు పఠించ కలిగితే మూడు జన్మల ప్రయాసకు లభించవల్సిన ఫలం ఈ ఒక్క జన్మలోనే లభిస్తుంది.

No comments: