Thursday, August 18, 2011

మహా రచయిత్రి

అమ్మా అమ్మోరు తల్లి !
ఎన్నో కథలు చదివేను
మరెన్నో కథలు వ్రాసాను
ఎందరో మనుషుల జీవితాలను చూస్తున్నాను
వింటున్నాను
మరెందరో మనుషుల జీవిత సుఖ దుఖాల్లో పాలు పంచుకున్నాను
అయితే అమ్మా !
నా జీవన గాదలో మాత్రం ఎందుకే ఇంతటి డ్రాగింగ్
నా తల్లికి కుచేలుని భార్య పేరు కుదిరింది కాబట్టె
ఈ దారిద్రియం ఇలా వెంటాడుతుందా
పుట్టిన నాటినుండి నేటి వరకు
ఏదో రూపంలో ఏదో మూతాదులో
దారిద్రియం !దారిద్రియం!!
ఈ దారిద్రియాన్ని దగ్దం చేసేందుకు
ఎంతగానో దిగ జారాను
కాని దారిద్రియంలో మాత్రం మార్పు లేదు
నీడలా..పాపంలా.శాపంలా..మరణంలా వెంటాడుతూనే ఉంది
అవీ గడిచి పోయాయి
తపస్సు చేసాను
ఒకే భీజాన్ని 9 సం.లుగా ద్యానిస్తూనేఉన్నాను
ఏవో కొన్ని అధ్భుతాలు జరుగుతున్నాయిగాని
నా దారిద్రియం మాత్రం దగ్దం కావడం లేదు
ఎందుకు?
1967 1986 మద్యన గడిచిన 19 సం.ల కాలాన్ని విడిచి పెడదాం
అప్పుడు నేను కేవలం తెలివైన చిలుకను మాత్రమే
మరి నేడు
హే మదుర మీనాక్షి !
చేతిలోని చిలకంత స్థాయికి ఎదిగాను
హే అంబా!
నా పలుకులు నీ పలుకులంతటి భీబత్సాన్ని సృష్ఠించేస్తున్నాయి
పూజ్యులు పూజ్యాలవుతున్నారు
రాజ్యాలే గడ గడ వనుకుతున్నాయి
మరి నా దారిద్రియం మటుకు
కొన ప్రాణంతోనన్నా కొట్టు మిట్టాడుతూనే ఉంది
పొరబాటున నా దారిద్రియానికి
చిరంజీవత్వం ప్రసాదించ లేదుగదా?
పొరభాటున నా దారిద్రియానికి అమృత సేవనం గావించలేదుగదా?
నేను చెయ్యాలి యుద్దం
అందుకు నా దారిద్రియం కావాలి దగ్దం

No comments: